English | Telugu

పవన్ కోసం ఏకమైన టాలీవుడ్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం అక్టోబర్ 9వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే ఈ చిత్రాన్ని విడుదలకు ముందే లీక్ చేసేసారు. దీంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర పైరసీపై టాలీవుడ్ మొత్తం ఏకమై ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు. ప్రేక్షకులు కూడా తమ ఇతర హీరో, తమ హీరో అనే భావన లేకుండా ఈ పైరసీపై పవన్ కు అండగా నిలుస్తున్నారు. భారీ అంచనాలతో విడుదలవుతున్నఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.