Read more!

English | Telugu

పూరీ, మహేష్ బాబు బిజినెస్ జూలైలో

పూరీ, మహేష్ బాబు బిజినెస్ జూలైలో ప్రారంభమవుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఆర్.ఆర్. మూవి మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మించబోతున్న చిత్రం"బిజినెస్ మేన్". ఈ "బిజినెస్ మేన్" చిత్రానికి "గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్" అన్న క్యాప్షన్ ని నిర్ణయించారు. "బిజినెస్ మేన్"చిత్రంలో హీరో మహేష్ బాబు సరసన తొలిసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూంది.

"బిజినెస్ మేన్"సినిమా రానున్న జూలై నెలలో లాంఛనంగా ప్రారంభం కానుంది. "బిజినెస్ మేన్" సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆగస్టు నెల నుండి ప్రారంభమవుతుందని ఈ చిత్రం యూనిట్‍ తెలియజేసింది. గతంలో మహేష్ బాబు హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "పోకిరి"సినిమా 75యేళ్ళ బాక్సాఫీస్ చరిత్రనే తిరగరాసింది. ఆతర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కలయికలో వస్తున్న చిత్రం "బిజినెస్ మేన్" కావటంతో ఈ "బిజినెస్ మేన్" మువి మీద ప్రేక్షకులకూ, సినీ వర్గానికి అత్యంత భారీ అంచనాలుంటాయి.