English | Telugu

హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తమన్ !!


క్రికెట్ పరిభాషలో అయితే దీన్ని "ఫాస్టెట్ హాఫ్ సెంచరీ" అనొచ్చు. కేవలం అయిదు సంవత్సరాల సమయంలో యాభై చిత్రాల మైలురాయిని చేరుకోవడమంటే మామూలు విషయం కాదు. కానీ తమన్ ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు.


శంకర్ దర్శకత్వంలో వచ్చిన "బోయ్స్" చిత్రంలో నటుడిగా పరిచయమైన తమన్.. ఆ తర్వాత "కిక్" చిత్రంతో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి వరుసగా తెలుగు, తమిళ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.


ఒకవైపు స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్నందిస్తూనే.. మరోవైపు చిన్న హీరోల చిత్రాలకూ బాణీలు సమకూరుస్తున్న తమన్.. తాజాగా "శ్రీనువైట్ల_మహేష్‌బాబు" కాంబినేషన్‌లో వస్తున్న "ఆగడు" చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రమే తమన్ యాభైయ్యవ చిత్రంగా నిలవనుంది.


అయితే.. "క్వాంటిటీ కన్నా.. క్వాలిటీ మిన్న" అని నమ్మే మన తెలుగు పరిశ్రమలో తమన్ మరికొంత కాలం సంగీత దర్శకుడిగా నిలదొక్కుకోవాలంటే... తన మూస ధోరణి నుంచి బయటకు వచ్చి.. కొత్త తరహా సంగీతాన్ని అందించాల్సిందే!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.