Read more!

English | Telugu

ప్రముఖ నటుడు మిస్సింగ్.. ఏప్రిల్ 25 నుంచి కనపడటం లేదు 

కళకి చిన్నాపెద్దా తారతమ్యం ఉండదు. సినిమా నటుల నుంచి సీరియల్స్ నటుల దాక అందరకి ప్రేక్షకాదరణ దక్కేలా చేస్తుంది. దాంతో ఆ రెండు రంగాల్లోని వాళ్ళు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులకి సొంత వాళ్ళలాగా మారిపోతారు. అలా సొంత వాడిగా మారిన ఒక నటుడు ఇప్పుడు కనపడటం లేదు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గురుచరణ్ సింగ్.. హిందీలో ప్రసారమయ్యే తారక్ మెహతా కా ఉల్తా ఛష్మ సీరియల్ లో సోది క్యారక్టర్ ద్వారా అశేష అభిమానులని సంపాదించుకున్నాడు. ఆయన కోసమే సీరియల్ చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. గత నాలుగు రోజులు నుంచి సింగ్  కనిపించడం లేదు. ఢిల్లీలో నివాసం ఉండే సింగ్ మొన్న సోమవారం ఉదయం  ముంబై కి వెళ్తున్నానని చెప్పి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాడు. కానీ ఆయన ముంబై కి వెళ్ళలేదు.  తిరిగి ఢిల్లీలోని ఇంటికి కూడా  రాలేదు. దీంతో అయన తండ్రి సమీప పోలీసుస్టేషన్ లో  ఫిర్యాదు చేసాడు. పోలీసులు మిస్సింగ్ కేసుగా  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇక సింగ్ గురించి సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన తండ్రికి అనారోగ్య కారణాల వలన హఠాత్తుగా సీరియల్ నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకి రావాల్సిన రెమ్యునరేషన్ కూడా  యాజమాన్యం ఇవ్వలేదు.  మరి ఆ కోణంలో పోలీసులు విచారణ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇక తారక్ మెహతా కా ఉల్తా ఛష్మ 2008 లో ప్రారంభం అయ్యింది. ఇప్పటికి 4064 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది.కామెడీ ప్రధాన కంటెంట్ గా  తెరకెక్కింది