Read more!

English | Telugu

అందాలు చిందించే సన్ని లియోన్‌.. ఈసారి భయపెడుతుందట!

సన్ని లియోన్‌ అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చెయ్యాలని డిసైడ్‌ అయినట్టుంది. ఇప్పటికే చాలా భాషల్లో సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం తమిళ్‌, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. తెలుగులో సన్ని చేసిన చివరి సినిమా ‘జిన్నా’. మంచు విష్ణు హీరోగా రూపొందిన ఈ సినిమా 2022లో విడుదలై డిజాస్టర్‌ అయింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. 

‘జిన్నా’లో ఆమెకు మంచి పాత్ర లభించింది. హారర్‌, సైక్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో కూడిన సినిమా కావడంతో ఆమె చేసిన క్యారెక్టర్‌ అందరికీ నచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతోంది. హారర్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో సన్ని ప్రధాన పాత్ర పోషించింది. తమిళనలో ‘ఓ మై ఘోసన్ట’ పేరుతో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ‘మందిర’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. విజన్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొమ్మలపాటి శ్రీధర్‌ సమర్పణలో సాయి సుధాకర్‌ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్‌.యువన్‌ దర్శకత్వం వహించారు. త్వరలోనే ‘మందిర’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.