Read more!

English | Telugu

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ అత్తగా సుహాసిని..!

యంగ్ టైగర్ జనతా గ్యారేజ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శ్రీమంతుడు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో, కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తుండగా, మోహన్ లాల్ సరసన మొదట దేవయానిని ఎంపిక చేశారు. కానీ ఏమైందో ఏమో ఆ తర్వాత, కొరటాల శివ ఆ పాత్రకు సుహాసినీ మణిరత్నంను ఎంపిక చేసుకున్నాడు.

ఇప్పటికే రాఖీ, బాద్ షా సినిమాల్లో ఎన్టీఆర్, సుహాసిని కాంబినేషన్లో అద్భుతమైన సీన్లు పండాయి. జనతా గ్యారేజ్ లో కూడా ఎన్టీఆర్ సుహాసినిల మధ్య కీలక సన్నివేశాలున్నాయట. అందుకే ప్రూవ్ అయిన సుహాసిని ఎన్టీఆర్ కాంబోను కొరటాల శివ జనతా గ్యారేజ్ కు కూడా ప్రిఫర్ చేస్తున్నాడట. సినిమాలో ఎన్టీఆర్ కు మావయ్యగా మోహన్ లాల్, మేనత్తగా సుహాసని నటిస్తారని సమాచారం. ఇప్పటికే ముంబైలో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న మూవీ టీం, వచ్చే నెల నుంచీ సారథి స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన గ్యారేజ్ సెట్లో మెజారిటీ షెడ్యూల్ ను పూర్తి చేయనున్నారు.