English | Telugu

సెప్టెంబర్ 24 న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరో గా, పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకుడి గా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’.

అమెరికా లో 35 రోజుల పాటు ఎన్నో అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అయినటువంటి ఆగష్టు 22 న ఈ చిత్రం ఆడియో ను విడుదల చేసి, సెప్టెంబర్ 24న భారీ స్థాయి లో చిత్రాన్ని ప్రపంచవ్యాప్తం గా విడుదల చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు .

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చే చిత్రాలకు ఉండే ఉన్నతమైన సాంకేతిక విలువలు, హరీష్ శంకర్ రాసే పదునైన సంభాషణలు, సాయి ధరం తేజ్ అధ్బుతమైన డాన్స్ మరియు నటన, రెజినా గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు గా నిలుస్తాయి అని చిత్ర బృందం చెబుతోంది.

సాయి ధరమ్ తేజ్, రెజినా , నాగబాబు, కోటా శ్రీనివాస రావు, పృథ్వి, రావు రమేష్ తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫి : C రామ్ ప్రసాద్ . ఎడిటింగ్ : గౌతం రాజు . ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, వెంకట్ . స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న . కో ప్రొడ్యూసర్స్ – శిరీష్, లక్ష్మణ్. నిర్మాత – దిల్ రాజు. కథ – మాటలు – దర్శకత్వం : హరీష్ శంకర్ ఎస్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.