Read more!

English | Telugu

'SSMB 29' మూవీ లాంచ్ కి ముహూర్తం ఖరారు!

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో గ్లోబల్ లెవెల్ లో సత్తా చాటిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli).. తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 29వ(SSMB 29) చిత్రంగా రానున్న ఈ ఫిల్మ్.. ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించి, తన కొత్త సినిమా కథ ఎలా ఉండబోతుందో ముందుగానే వివరించడం రాజమౌళి శైలి. 'ఆర్ఆర్ఆర్' విషయంలో అదే చేశారు. ఇప్పుడు 'SSMB 29' కోసం కూడా అదే చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమాని అధికారికంగా ప్రారంభించి.. తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా సమక్షంలో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి.. చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారట. దీనికి ముహూర్తం కూడా నిర్ణయించారట. మహేష్ తండ్రి, లెజెండరీ యాక్టర్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారట. అదే రోజు మూవీ లాంచ్ తో పాటు, ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశముందని సమాచారం.