Read more!

English | Telugu

ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

 

మలయాళం, తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి ఉండే క్రేజే వేరు. కొన్ని నెలల క్రితం తమిళంలో రిలీజైన సినిమాలని తెలుగులో డబ్ చేస్తున్నారు. అందులో కొన్ని సూపర్  హిట్ అయిన సినిమాలు ఇప్పుడు మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలుగా తమిళంలో రిలీజైన సినిమా ' సైరైన్'. కాగా ప్రస్తుతం ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 11 న స్ట్రీమింగ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. సైరైన్ మూవీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు. భూమి, టిక్ టిక్ టిక్,  పొన్నియన్ సెల్వన్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు జయం రవి. ప్రస్తుతం జయం రవి జీనీ అనే సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో నితిన్, సదా నటించిన జయం సినిమాను తమిళంలో రీమేక్ చేసి.. హిట్ కొట్టాడు. అలా జయం రవిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఎడిటర్ మోహన్ కుమారుడే జయం రవి. జయం రవి అన్న సైతం ఇండస్ట్రీకి తెలిసిన వ్యక్తే. ఆయన ఎవరో కాదు.. మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ మోహన్ రాజా. అన్న డైరెక్టర్ గా సినిమాలు చేస్తే.. తమ్ముడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

భార్య జెన్నీఫర్ (అనుపమ పరమేశ్వరన్)ను మర్డర్ చేసిన కేసులో తిలగన్‌కు (జయం రవి)కి శిక్ష పడుతుంది. ఇతనికి ఓ కూతురు కూడా ఉంటుంది. అయితే పెరోల్ పై జైలు నుండి బయటకు వచ్చిన హీరోను.. తల్లిని చంపినందుకు ఆ పాప అసహ్యించుకుంటుంది. కూతురు బంధువుల ఇంటికి వెళ్లిపోగా.. తిలగన్ వరుసగా హత్యలు చేసుకుంటూ పోతాడు. తిలగన్ కేసును కీర్తి సురేష్ ఇన్విస్టిగేషన్ చేపట్టగా...తిలగన్‌ను ఎలా పట్టుకుంటుంది.. అసలు భార్యను తిలగన్ ఎందుకు చంపాడన్నది తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 11న ఈ రిలీజ్ అవుతున్న సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా కథ కొత్తగా ఉండటం, ట్విస్ట్ లు ఉండటంతో ఓటీటీ అభిమానులకి ఈ సినిమా ఓ ఫీస్ట్ అవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.