English | Telugu

పెళ్ళికి సిద్దమైన "వాలు" జంట?

తమిళ లిటిల్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శింబు ప్రేమాయణం ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. గతంలో నయనతారతో కలిసి ప్రేమాయణం నడిపిన శింబు, ఆ తర్వాత నయనతారకు దూరం అయ్యాడు. ఆ తర్వాత శింబు చాలా మంది హీరోయిన్ లతో ప్రేమాయణం సాగించాడు. అయితే ఈ మధ్య శింబు ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయంట. దానికి కారణం ముద్దు గుమ్మ హన్సిక.

అవునండి! వీళ్ళిద్దరూ కలిసి నటించిన తాజా తమిళ చిత్రం "వాలు". అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరూ బాగా దగ్గరయ్యారని తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.... శింబు త్వరలోనే హన్సికను పెళ్లి చేసుకోబోతున్నాడట. వీరి పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని తెలిసింది.

ఇటీవలే శింభు తండ్రి టి.రాజేందర్ మాట్లాడుతూ.. "నా కొడుకు ఎవరిని ఇష్టపడితే వారిని ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. హన్సికను పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూడా మేం ఏమి అనము" అని చెప్పాడు. అంటే త్వరలోనే వీరి పెళ్లి కానుందని చెప్పకనే చెప్పారు.

అయితే శింబు ప్రస్తుతం తన చెల్లి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. అదే విధంగా హన్సిక కూడా కొన్ని తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ చిత్రాలన్నీ పూర్తయిన తర్వాత వీరు పెళ్లి చేసుకుంటారని తెలుస్తుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.