Read more!

English | Telugu

బాలకృష్ణ హీరోయిన్ ఆస్తుల జప్తు

బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు లాంటి టాప్ స్టార్స్ నటించిన ముద్దుగుమ్మ శిల్పా శెట్టి (shilpa shetty) బాలీవుడ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు సాగర కన్య  శిల్పాశెట్టి కి ఎక్కడా లేని కష్టం వచ్చి పడింది.

2017లో శిల్పా శెట్టి భర్త  రాజ్ కుంద్రా(raj kundra) తన స్నేహితులతో కలిసి బిట్ కాయిన్ అనే సంస్థని ఏర్పాటు చేసాడు. అందులో పెట్టుబడి పెడితే 10 శాతం లాభాలు వస్తాయని పలువురిని నమ్మించాడు.దాంతో  చాలా మంది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు.  అలా సుమారు  6600 కోట్ల దాకా వసూలు చేసాడు. ఆ తర్వాత  బోర్డు తిప్పేసాడు.ఈ విషయంపై  దేశంలోని చాలా నగరాల్లో  పోలీసు కేసు కూడా నమోదు అయ్యింది.ఇప్పుడు ఈ కేసులోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  రాజ్ కుంద్రా కి చెందిన 97 కోట్ల ఆస్తులని జప్తు చేసింది. వాటిల్లో శిల్పా శెట్టి పేరు మీద ముంబై ,పూణే లలో ఉన్న ఇల్లులు కూడా ఉన్నాయి.

రాజ్ కుంద్రా దగ్గర ప్రస్తుతం 285 బిట్ కాయిన్ లు ఉన్నాయి. వీటిని కుంద్రా స్నేహితుడు కంపెనీ డైరెక్టర్ లలో ఒకరైన అమిత్ భరద్వాజ్ కుంద్రా కి ఇచ్చాడు. కాకపోతే ఆయన 2022 లోనే చనిపోయాడు.ఇక కుంద్రా  వాటితో ఉక్రెయిన్ లో మైనింగ్ ఫామ్ ని ఏర్పాటు చెయ్యాలని భావించాడు. వాటి విలువ 150 కోట్ల దాకా ఉంటుంది. ఈ విషయాలన్నింటిని కూడా ఈడీ వెల్లడి చేసింది. అయితే ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని కుంద్రా తరుపు న్యాయవాది తెలిపారు.కుంద్రా కి చెందిన  కొంత మంది స్నేహితులు పరారీలో ఉన్నారు.