English | Telugu

కళ్యాణ్‌రామ్‌ ‘షేర్‌’ పూర్తయింది

డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘షేర్‌’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. జూలై 5 డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘షేర్‌’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, డిజిటల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ ` ‘‘మా హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘షేర్‌’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌, డిజిటల్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. నిర్మాతల హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌గారితో సినిమా చెయ్యడం చాలా ఆనందంగా వుంది. ‘పటాస్‌’తో సూపర్‌హిట్‌ సాధించిన కళ్యాణ్‌రామ్‌గారికి ‘షేర్‌’ కూడా మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌గారు ఓ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లోనే రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

దర్శకుడు మల్లికార్జున్‌ మాట్లాడుతూ ` ‘‘మా ‘షేర్‌’ కళ్యాణ్‌ రామ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో ‘షేర్‌’ ఒక సెన్సేషనల్‌ మూవీ అవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా వుంటుంది. ‘పటాస్‌’ తర్వాత మళ్ళీ కళ్యాణ్‌రామ్‌గారు ఈ సినిమాలో విజృంభించి నటించారు’’ అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.