Read more!

English | Telugu

కృతి శెట్టిని ఏడిపించిన శర్వానంద్!

'ఒకే ఒక జీవితం' వంటి విజవంతమైన చిత్రం తర్వాత ఏడాది విరామం తీసుకున్న టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand).. మరోసారి ఫీల్ గుడ్ మూవీతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'మనమే'(Manamey). శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.

'మనమే' టీజర్ (Manamey Teaser) కూల్ గా, బ్యూటిఫుల్ గా ఉంది. "మంచిగా కనపడే వాళ్ళందరూ మంచోళ్ళు కాదురా. ఫర్ ఎగ్జాంపుల్ నేను. చాలా మంచోడిలా కనిపిస్తా.. కానీ మంచోడిని కాదు" అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. ఇక, మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండే యువతిగా కృతి శెట్టి పాత్ర పరిచయమైంది. శర్వానంద్, కృతి శెట్టి పాత్రలు ఒకరికొకరు పరిచయం కావడం, ఓ బాబు రాకతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో అనే ఆసక్తిని రేకెత్తిస్తూ టీజర్ ను రూపొందించారు. బాబు ఏడుస్తున్నాడని కృతి ఎమోషనల్ అవుతూ అరుస్తుండగా.. "ఇద్దరిలో ఒక్కరే ఏడవండి" అంటూ శర్వా చెప్పిన డైలాగ్ తో టీజర్ ని ముగించిన తీరు బాగుంది.

టీజర్ లో శర్వానంద్ సైలిష్ గా కనిపిస్తున్నాడు. కృతి శెట్టి కూడా ఎంతో అందంగా ఉంది. బ్యూటిఫుల్ విజువల్స్, మ్యూజిక్ తో టీజర్ కలర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమా ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.