English | Telugu

రవితేజ "సారొస్తారు" ప్రారంభం

రవితేజ "సారొస్తారు" ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, మాస్ మహరాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, "యువత, సోలో" ఫేం పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో, చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం"సారొస్తారు". ఈ చిత్రం లాంఛనంగా ఆ సంస్థ కార్యాలంయంలో ఇదివరకే ప్రారంభమయ్యింది.ఈ చిత్రం జూన్ 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఊటీలో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.

ముందుగా ఈ చిత్రంలో త్రిష పేరు హీరోయిన్ గా వినిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలోకి కాజల్ వచ్చి చేరింది. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని "దేవుడు చేసిన మనుషులు" చిత్రం షూటింగ్ రవితేజ పూర్తిచేశాడు. అలాగే కాజల్ కూడా జూన్ 16 నుండి ఈ "సారొస్తారు" చిత్రంలో నటించేందుకు వీలుగా తన డేట్లను సర్దుబాటుచేసుకుందట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.