English | Telugu

రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్ ఖాన్.. కారణం తెలుసా..?

- ముంబై వెళ్ళిన తెలంగాణ సీఎం
- రేవంత్ రెడ్డితో సల్మాన్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) కలిశారు. గురువారం సాయంత్రం ముంబైలో వీరి భేటీ జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు రేవంత్ రెడ్డిని సల్మాన్ ఖాన్ కలవడానికి కారణమేంటి? అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.

'తెలంగాణ రైజింగ్' నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నినాదానికి సల్మాన్ ఖాన్ తన మద్దతు తెలిపాడు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి, తెలంగాణ అభివృద్ధి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని సల్మాన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్న తీరుని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సల్మాన్ అభినందించినట్లు సమాచారం.

ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంట్లో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను అటు సల్మాన్ అభిమానులు, ఇటు రేవంత్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.

Also Read: మాస్ జాతర బిజినెస్.. ఈసారైనా హిట్ కొడతాడా..?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.