English | Telugu

భైరవద్వీపం మూవీకి 30 రూపాయలు జీతం ఇచ్చారు..

ఆహా ఇండియన్ ఐడల్ ఈ వారం ఎపిసోడ్ లో లేడీ రాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బృంద వచ్చి " నరుడా ఓ నరుడా" అనే సాంగ్ పాడింది. జడ్జెస్ అందరూ ఫిదా ఇపోయారు. ఇక థమన్ ఈ సాంగ్ తనకు ఎందుకు గొప్ప మెమొరీనో చెప్పుకొచ్చారు. "ఈ పాట పాడిన వెంటనే నేను మా నాన్నకు భోజనం తీసుకెళ్ళాను. ఆయన ఈ భైరవ ద్వీపం సినిమా మొత్తానికి మ్యూజికల్ ఇన్ఛార్జ్. 70 ఎంఎంలో రికార్డింగ్ థియేటర్ లో ఒక సాంగ్ వినడం అదే మొదటిసారి. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఈ సినిమాలో రోజా గారు బెడ్ పడుకుని కదులుతూ ఉండే టైములో బెడ్ లేస్తుంది. అందులోంచి ఒక టింపని అనే డ్రం వస్తుంది. దాన్ని నేను వాయించాను. దానికి నాకు 30 రూపాయలు జీతం ఇచ్చారు. ఆ డ్రం పెడల్ నొక్కాలంటే 50 కిలోల బరువు ఉండాలి. కాలు దగ్గర ఒకతను ప్రెస్ చేస్తే నేను పైన డ్రమ్స్ వాయించాను. మా నాన్న నన్ను ఎత్తుకుంటే నేను వాయించాను. నాకు ఆ మెమరీ చాలా స్వీట్ గా ఉంటుంది తలుచుకున్నప్పుడల్లా. ఇంకా జానకమ్మ పాటలు పాడే విషయంలో ఎంత సెన్సిటివ్ ఉంటారో నాకు తెలుసు. అప్పుడు ఒక భయం ఉండేది.

80 మంది ఆర్కెస్ట్రా ముందర తప్పు చేయకూడదు. జాగ్రత్తగా పాడాలి అని. తప్పు పాడితే ఆర్కెస్ట్రా మళ్ళీ తిరిగి మొదటి నుంచి ప్లే చేయాలి అనే భయం ఉండేది. అందులోనూ ఎక్విప్మెంట్ కూడా సరిగా ఉండేది. అందుకే అస్సలు ఒక్క తప్పు కూడా జరగకుండా పాడేవారు. అందుకే అంతా ఒకేసారి వాయించాలి..ఒకేసారి పాడేయాలి..ఒకేసారి రికార్డింగ్ జరుగుతుంది. ఆ వన్ టేక్ కోసం అందరూ వెయిట్ చేసేవారు." అంటూ థమన్ చెప్పుకొచ్చాడు. బృందా నువ్వు జానకి గారిని మరిపించేలా పాడావ్ అంటూ ఆమెను మెచ్చుకున్నాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.