English | Telugu

బలుపు కోసం మాస్ రాజ వెయిటింగ్

పూరి జగన్నాధ్ ఏ క్షణంలో ఇడియట్ సినిమా తీసాడో కానీ, అప్పటి నుండి రవితేజ మాత్రం అలాంటి సినిమాలే చేసుకుంటూ వస్తున్నాడు. ఏ సినిమా చూసినా కూడా అమ్మాయిల వెంటపడటం, వాళ్ళను ఏడిపించే కథలకే రవితేజ ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాడు. దీంతో జనాలు రవితేజ సినిమా అంటేనే బోర్ అనేలా తయారయ్యారు. అందుకే 'కిక్' చిత్రం తర్వాత రవితేజ నటించిన ఏ ఒక్క చిత్రం కూడా విజయం సాధించకపోగా... అట్టర్ ప్లాప్ అయ్యాయి.

'దొంగలముఠా, వీర, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారోచ్చారు' వంటి వరుస అట్టర్ ప్లాప్ చిత్రాల తర్వాత రవితేజ నటించిన తాజా చిత్రం 'బలుపు'. ఈ చిత్రాన్ని ఎలాగైనా విజయం సాధించేలా చేయాలనీ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ నుంచే ప్రచారం మొదలు పెట్టేసాడు. ఈ చిత్రంలో రవితేజ ఒక పాట కూడా పాడటం, ఆ పాటకు ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్స్ తో కలిసి డాన్సులు కూడా చేసి సినిమాకి కాస్త క్రేజ్ వచ్చేలా తన ప్రయత్నం తాను చేసాడు.

మరి ఈ మాస్ రాజకి 'బలుపు'తో విజయం దక్కుతుందో లేక "ట్యూబ్ లైట్" లాగా ప్లాప్ అవుతుందో త్వరలోనే తెలియనుంది. మరో గమనిక... అసలే ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉన్న మనోడికి ఏ సినిమా ఆఫర్లు రాకపోతే.... తనే ఓ చిత్రాన్ని నిర్మిస్తూ, దర్శకత్వం కూడా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.