English | Telugu

రవితేజ, బ్రహ్మానందం మధ్యలో విలన్

మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ బ్రహ్మానందం రామోజీ ఫిల్మ్ సిటీలో విలన్ లతో ఆటాడుకుంటున్నారు. వీరిద్దరి కలిస్తే చేసే హంగామా ఎలా వుంటుందో, ఇది వరకే ఎన్నో సినిమాల్లో సినీ ప్రేక్షకులు చూసే వుంటారు. లేటెస్ట్ గా 'బెంగాల్ టైగర్' సినిమా కోసం కూడా వీరు విలన్ తో ఆడుకోవాలని డిసైడ్ అయ్యారట. ఆ విషయం విలన్ కి తెలిసేసరికి వీరి వెంట పడ్డారట.

మన మాస్ మహారాజుకు వారిని వె౦టనే కొట్టేస్తే మజా వుండదు కదా. అందుకే వారందని తన చూట్టు ఫిల్మ్ సిటీ మొత్తం తిప్పుకొని, ఆతరువాత చితక్కోట్టాడట. ప్రస్తుత౦ బెంగాల్ టైగర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. రవితేజ తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బోమన్ ఇరాని ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.