Read more!

English | Telugu

విశాల్ రత్నం ఓటిటి లోకి..పండగ డేట్ ఇదే   

ఏది ఏమైనా ఓటిటి సినీ ప్రేక్షకులు  అదృష్టవంతులని చెప్పాలి. కొత్త కొత్త సినిమాలు ఓటిటి లోకి అడుగుపెడుతున్నాయి.      సిల్వర్ స్క్రీన్ మీద అలా మెరిసాయో లేదో ఇలా ల్యాండ్ అవుతున్నాయి.  ఇప్పుడు ఈ కోవలో ఊర మాస్ మూవీ రత్నం కూడా చేరబోతోంది 


విశాల్  హీరోగా తెరకెక్కిన చిత్రం రత్నం. ఏప్రిల్ 26 న తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుదల అయ్యింది. యాక్షన్ చిత్రాలని ఇష్టపడే ప్రేక్షకులకి బాగానే కనెక్ట్ అయ్యింది. ఫ్యామిలీస్ మాత్రం  పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.ఇక ఈ మూవీ ఓటిటి హక్కులని అమెజాన్ ప్రైమ్  భారీ రేటుని వెచ్చించి దక్కించుకుంది. ఇప్పుడు ఒక ఇంట్రస్ట్ న్యూస్ బయటకి వచ్చింది.మే 24 నుంచి రత్నం స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ఈ విషయం మీద అమెజాన్ నుంచి  అధికారకంగా ప్రకటన కూడా రానుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ విశాల్ అభిమానుల్లో పండగ వాతావరణం తెచ్చింది

విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ జత కట్టింది.సముద్ర ఖని, మురళి శర్మ ,కామెడీ కింగ్ యోగి బాబు లు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ బ్యానర్ పై కార్తికేయన్ సంతానం నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఊర మాస్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వం వహించాడు.సూర్య సింగం సిరీస్ సృష్టికర్త ఈయనే. విశాల్ హరి కాంబోలో ఇంతకు ముందు భరణి ,పూజ చిత్రాలు వచ్చాయి.రత్నం మూడో మూవీ