English | Telugu

‘రావు బహదూర్‌’ ఫస్ట్‌లుక్‌.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హీరో!

కేరాఫ్‌ కంచరపాలెం వంటి డీసెంట్‌ హిట్‌ చిత్రాన్ని రూపొందించిన వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో రాబోతున్న మరో విభిన్న చిత్రం ‘రావు బహదూర్‌’. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.‘అనుమానం పెనుభూతం’’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌లో సత్యదేవ్‌ ఓల్డ్‌ గెటప్‌లో కనిపిస్తూ అందర్నీ షాక్‌కి గురి చేస్తున్నాడు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో, శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అప్లాజ్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తునరీ చిత్రాన్ని వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. కేరాఫ్‌ కంచరపాలెం చిత్రం తర్వాత వెంకటేష్‌ మహా రూపొందించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంలో కూడా సత్యదేవ్‌ హీరోగా నటించారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న నటుల్లో సత్యదేవ్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తను చేసే సినిమాలు విభిన్నంగా ఉండడమే కాకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన విజయ్‌ దేవరకొండ సినిమా కింగ్డమ్‌లో ఓ కీలక పాత్రలో నటించి అందర్నీ మెప్పించారు. అలాగే సత్యదేవ్‌ నటించిన అరేబియా కడలి వెబ్‌ సిరీస్‌ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు వెంకటేష్‌ మహా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రావు బహదూర్‌’ తనకు హీరోగా బ్రేక్‌ ఇస్తుందని నమ్ముతున్నారు. ఇందులో ఓల్డ్‌ గెటప్‌లో ఉన్న ఓ జమీందారుగా సత్యదేవ్‌ ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారని అర్థమవుతోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు రూపొందించే వెంకటేష్‌ ఈ సినిమాలో కూడా ఏదో సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.