English | Telugu

చులకనవుతున్న చిరంజీవి !

రాజకీయాల్లోకి వెళ్లాక మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కొంచెం డామేజ్ అయినప్పటికీ.. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. ఈ మధ్య ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యారు కాబట్టి.. ఇండస్ట్రీలో గౌరవ మర్యాదలు కూడా మళ్లీ పెరిగాయి. చిరంజీవి వస్తానంటె ఆడియో ఫంక్షన్లు మాత్రమే కాదు.. అవార్డ్ ఫంక్షన్లు కూడా డేట్స్ మార్చుకుంటారు. అంతటి ప్రభావం కలిగిన మెగాస్టార్ చిరంజీవి.... మొన్న "ఎవడు" ఆడియో ఫంక్షన్‌లో హాజరుకావడం "తన అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ మాట్లాడడం మెగా అభిమానులకు అయోమయాన్ని కలిగించింది.

అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయన "సీక్రెట్" అనే పుస్తకాన్ని ప్రస్తావించడం ఆశ్చర్యానికిలోను చేసింది. "మనం ఏదైతే జరగాలని బలంగా కోరుకుంటామో.. అది కచ్చితంగా జరిగితీరుతుంది. నేను ఈ ఆడియో ఫంక్షన్‌కు హాజరు కాగలనో లేదోనని చాలా భయపడ్డాను. కానీ హాజరుకావాల్సిందేనని మనసులో మాత్రం బలంగా అనుకొన్నాను" అందుకే ఇది జరిగింది" అని ఈ సందర్భంగా చిరంజీవి ఎంతో ఉద్వేగంతో ప్రసంగించారు. "ఫలానా రోజయితేనే నాకు కుదురుతుంది" అని తన పి.ఎతో చెప్పించినా పనైపోయేదాని గురించి.. చిరంజీవి ఇంత ఇదిగా మాట్లాడడం ఆయన అభిమానులందరికీ ఎబ్బెట్టుగా అనిపించింది!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.