English | Telugu
రకుల్ ఆఫర్.. రామ్చరణ్కేనా???
Updated : Feb 23, 2016
రకుల్ ప్రీత్ సింగ్... తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన కథానాయిక. ఒక్కసారిగా టాప్ స్టార్లతో కలసి నటించే అవకాశం దక్కించుకొని.. బడా హీరోయిన్ల కన్నుకుట్టేలా చేసింది. ఏ సినిమా చేసినా.. రకులే కథానాయికగా కనిపించింది. దానికి తోడు హిట్లూ వచ్చాయి. అంతే.. ఒక్కసారిగా పారితోషికాన్ని కోటికి పెంచేసింది. అంతకు ముందు పాతిక లక్షలిచ్చి, కాల్షీట్లు కొనుక్కొన్న వాళ్లు కూడా రకుల్ డిమాండ్కి తగ్గట్టుగానే కోటి చదివించుకొన్నారు. అయితే.. ఒక్కసారిగా రకుల్ ఫేటు మారింది. సినిమాలన్నీ ఫ్లాపులయ్యాయి. కిక్ 2, బ్రూస్లీ డిజాస్టర్లతో నేలకు దిగింది. నాన్నకు ప్రేమతో విజయంతో కాస్త ఊపిరి తీసుకొంది. అయితే అనూహ్యంగా రామ్ చరణ్ కోసం తన రెమ్యునరేషన్ సగానికి సగం తగ్గించుకొని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం చరణ్ చేస్తున్న తనిఒరువన్ రీమేక్లో కథానాయికగా ఎంపికైంది రకుల్.
ఈ సినిమా కోసం రూ.60 లక్షల పారితోషికం తీసుకొంది. దాంతో మిగిలిన నిర్మాతలు, హీరోలూ నివ్వెర పోతున్నారు. ఫ్లాపుల్లో ఉన్నా.. రేటు తగ్గించని రకుల్ రామ్చరణ్పై ఇంత దయ ఎలా చూపించిందంటూ సెటైర్లు వేసుకొంటున్నారు. మా సినిమాలోనూ అంతకే నటిస్తావా? అని అడిగితే. `నా రిబేటు రామ్ చరణ్కే` అన్నట్టు మాట్లాడుతోందట. ఈ ఒక్క సినిమాకే పారితోషికం తగ్గించా, మీరు మాత్రం యథావిధిగా కోటి ఇవ్వాల్సిందే అని చిలక పలుకులు పలుకుతోందట. మరి రామ్చరణ్కే అంత బంపర్ ఆఫర్ ఎందుకో మరి! ? బ్రూస్లీ ఫ్లాప్ అయ్యిందన్న కన్సర్న్ తో ఆఫర్ ఇచ్చిందంటారా? ఏమో... ఆ సంగతి రకుల్కే తెలియాలి.