English | Telugu

బాలయ్య దర్శకుడితో రజినీకాంత్!

భాషతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయడానికి దర్శకులందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల 'జైలర్'తో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్.. త్వరలో తాను కీలక పాత్ర పోషించిన 'లాల్ సలామ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే తన 170వ సినిమాని టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో, 171వ సినిమాని లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేయనున్నాడు. అయితే వీటి తర్వాత రజినీ టాలీవుడ్ కి చెందిన ఓ దర్శకుడితో చేతులు కలపబోతున్నాడు.

'పవర్', 'జై లవ కుశ', 'వాల్తేరు వీరయ్య' వంటి సినిమాలతో మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు బాబీ కొల్లి. ప్రస్తుతం ఆయన నటసింహం నందమూరి బాలకృష్ణ 109వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీని తర్వాత బాబీ.. సూపర్ స్టార్ తో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రచయిత కోన వెంకట్ కన్ఫర్మ్ చేశాడు.

"రజినీకాంత్ గారితో సినిమా చేయబోతున్నారని తెలిసింది" అనే ప్రశ్నకు కోన వెంకట్ బదులిస్తూ "బాబీ నెక్స్ట్ ఫిల్మ్ అది. మేము కలిసి చేయబోతున్నాం. జైలర్ విడుదల కాకముందే కథ చెప్పడం జరిగింది. రజినీ గారికి కథ బాగా నచ్చింది, బాబీ అంటే ఆయనకు మంచి ఇంప్రెషన్ ఉంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు." అని చెప్పుకొచ్చాడు.

'NBK 109'తో బిగ్ స్క్రీన్ మీద నెత్తుటి స్నానం చేయించనున్న బాబీ.. రజినీకాంత్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.