Read more!

English | Telugu

ఐసియు నుండి రజనీని నార్మల్ రూముకి మార్చారు

ఐసియు నుండి రజనీని నార్మల్ రూముకి మార్చారు. వివరాల్లోకి వెళితే సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తను హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం" రాణా" ప్రారంభోత్సవానికి వెళ్ళి అనుకోకుండా అనారోగ్యం పాలయ్యారు. రజనీకాంత్ ఒక నెలలో మూడుసార్లు హాస్పిటల్‍ పాలయ్యారు. దీనివల్ల రజనీ కాంత్ ఇక కోలుకోరనీ, ఆయన ఏకంగా చనిపోయారనీ రకరకాల పుకార్లు మీడియాలో రాజ్యమేలటం, వీటికి రజనీ కాంత్ కుటుంబం వివరణ ఇచ్చుకుంటూ రావటం జరుగుతూంది.

నిన్నటి వరకూ రజనీ కాంత్‍ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో ఉన్న సూపర్ స్టార్ రజనీ కాంత్ ని ప్రస్తుతం నార్మల్ రూముకి మార్చారు. కనుక ఆయన ఆరోగ్యం గురించి ఆయన అభిమానులెవ్వరూ ఆందోళన చెందక్కర లేదు. రజనీ కాంత్ త్వరలోనే కోలుకుని తిరిగి "రాణా" షూటింగ్ లో పాల్గొంటారని ఆయన కుటుంబ సభ్యులు అభిమానులకు తెలియజేస్తున్నారు. అందరం అదే కోరుకుందాం.