Read more!

English | Telugu

బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్  టైటిల్ రెడీ.. ఏ శక్తీ ఆపదు అంటున్న రాజమౌళి  

ప్రపంచ సినిమా  తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఏ ముహూర్తాన  సినిమా టైటిల్స్ లో తన పేరు  రాజముద్ర లాగా పడిందో  గాని  ఇప్పుడు ఇండియన్ సినిమాకే రాజముద్ర అయ్యింది. ఆర్ఆర్ఆర్ తో తెలుగు వారికి ఆస్కార్ ని కూడా అందించాడు. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక అప్ డేట్ ని ఇచ్చాడు. ఇక అంతే ఇప్పుడు ఆ మ్యాటర్  టాక్ అఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది.

2015 , 2017 లో  బాహుబలి సిరీస్  సృష్టించిన సునామి అందరకి తెలిసిందే. నేటికి ఎన్నో రికార్డులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ  సరికొత్త రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతుంది. బాహుబలి నుంచి త్వరలో  యానిమేటెడ్ సిరీస్ రానుంది. దానికి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే  టైటిల్ ని  ఖరారు చేసారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ జక్కన్న ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చింది. యానిమేటెడ్ సిరీస్ ఎప్పుడొస్తే అప్పుడు చూడటానికి అందరు రెడీగా ఉన్నారు. మాహిష్మతి ప్రజలు అతని పేరు జపించినపుడు విశ్వంలోని ఏ శక్తీ అతను రాకుండా ఆపలేదు అనే క్యాప్షన్ ని జక్కన్న పోస్ట్ గా పెట్టాడు. 

జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో  మూవీ చెయ్యబోతున్నాడు. ఎప్పుడెప్పుడు అది  స్టార్ట్ అవుతుందా అని ఇద్దరి  ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు  ఎదురుచూస్తున్నారు.అదే విధంగా  ఈ సారి ఎలాంటి కథని ఎంచుకోబోతున్నాడనే క్యూరియాసిటీ  కూడా  అందరిలో ఉంది. బాహుబలి తో ప్రభాస్ కి, ఆర్ఆర్ఆర్ తో  ఎన్టీఆర్, చరణ్ లకి పాన్ ఇండియా ఇమేజ్ ఇప్పించిన జక్కన్న  మహేష్ కి కూడా పాన్ ఇండియా ఇమేజ్ కల్పించడం ఖాయమనే భావన అందరిలో ఉంది