English | Telugu

రామ్ చరణ్ "రచ్చ" ఓవర్ సీస్ 2.75 cr

రామ్ చరణ్ "రచ్చ" ఓవర్ సీస్ 2.75 cr అని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, అందాల కాజల్‍ అగర్వాల్ హీరోయిన్ గా, "ఏమైందీ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో నిర్మించబడుతున్న విభిన్నప్రేమకథా చిత్రం"రచ్చ". ఈ "రచ్చ" పేరు వింటేనే కథ ఎలా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. మణిశర్మ ఈ "రచ్చ" చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు.

ఈ "రచ్చ" సినిమా షూటింగ్ శ్రీలంకలో, చైనా దేశాల్లో జరిపారు. ఈ "రచ్చ" చిత్రం ఓవర్ సీస్ రైట్స్ 2.75 cr (రెండుకోట్ల డభై అయిదు లక్షలు) కు అమ్ముడుపోయినట్లు తెలిసింది. రామ్ చరణ్ సినిమాలన్నింటిలోకి ఓవర్ సీస్ కి అత్యధిక మొత్తంలో అమ్ముడుపోయిన సినిమా ఇదే కావటం గమనార్హం. ఈ "రచ్చ" సినిమాని తెలుగులోనే కాకుండా, తమిళ, మళయాళ భషల్లో కూడా విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తూంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.