English | Telugu

‘వాళ్ళు దొంగలు, మాఫియా..’ కాంట్రవర్సీగా మారిన నిర్మాతల కామెంట్స్‌!

తమ వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇంకా కొనసాగుతోంది. సమస్యను పరిష్కరించేందుకు పలు మార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో పూర్తి స్థాయిలో నమ్మెను కొనసాగిస్తున్నారు కార్మికులు. ఫిలిం ఫెడరేషన్‌లో భాగమైన తెలుగు సినిమా డ్రైవర్స్‌ యూనియన్‌ నిర్మాతల పట్ల తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లను నిర్మాతలు దొంగలుగా, మాఫియాగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వారి ఆగ్రహానికి కారణమైంది.

దీనిపై డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులు మాట్లాడుతూ ‘ఒక సింగిల్‌ కాల్‌షీట్‌కు డ్రైవర్‌కు 1195 రూపాయలు ఇస్తున్నారు. మూడేళ్ళకోసారి 30 శాతం వేతనం పెంచడం వల్ల అందులో 50 శాతం నష్టపోతున్నాం. ఇంతటి మహానగరంలో జీవనం సాగించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. దాన్ని దృష్టిలోపెట్టునకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారు కనీసం 50 శాతం వేతనం పెంచాలని సూచించారు. కొందరు నిర్మాతలు మమ్మల్ని దొంగలుగా, మాఫియాగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ నిర్మాతలు చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. అలా చేయకపోతే వారి ఆఫీసుల ముందు ధర్నా చేస్తాం. మేమెంతో కష్టపడి పనిచేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మమ్మల్ని అవమానించడం కరెక్ట్‌ కాదు. దాసరి నారాయణరావుగారు ఏర్పాటు చేసిన ఈ యూనియన్‌ను విచ్ఛిన్నం చెయ్యాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు’ అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.