Read more!

English | Telugu

రెండేళ్ళ వరకు కాల్ షీట్స్ లేవన్న ప్రియమణి!

యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ప్రియమణి.. ఆ సినిమాలో తన నటనకి, డ్యాన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఒకప్పుడు తెలుగు అగ్రహీరోలతో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక పెళ్ళి చేసుకొని కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న ఈ భామ.. ఢీ షో కి జడ్జిగా తన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది.

ఒకప్పుడు హీరోయిన్‌గా స్టార్ హీరోల పక్కన నటించింది ప్రియమణి. ముఖ్యంగా గ్లామర్ పాత్రలతో ఆకట్టుకుంది. కానీ పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకోవడంతో ప్రియమణి కెరీర్ స్లో అయింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఊహించని విధంగా కమ్ బ్యాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రియమణి జోరు మాములుగా లేదు. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ప్రియ ఫుల్ బిజీగా ఉంది. ఎంతలా అంటే దాదాపు రెండేళ్ల వరకూ ఆమె కాల్ షీట్స్ కూడా దొరికే అవకాశం లేదు. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వరుసగా నారప్ప, భామ కలాపం, విరాటపర్వం, కస్టడీ, జవాన్, నెరు, భామ కలాపం 2, ఆర్టికల్ 370, మైదాన్ లాంటి సినిమాలతో దుమ్మురేపింది. ప్రస్తుతం సౌత్ టూ నార్త్ అన్ని ఇండస్ట్రీల్లోనూ ప్రియమణికి డిమాండ్ పెరిగింది. 

ప్రియమణికి ఇన్ స్టాగ్రామ్ లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా మైదాన్ మూవీ ప్రీమియర్స్ లో బోనీ కపూర్ తనతో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అయింది. దాంతో ఒక్కసారిగా బాలివుడ్ లో ప్రియమణి పేరు టాప్ లోకి వచ్చేసింది. ఇక ఇప్పుడేమో సినిమాలు గ్యాప్ లేకుండా చేస్తూ బిజీగా ఉంటుంది.