Read more!

English | Telugu

డిసైడ్ చేసుకో.. నిన్ను ఎవరు పరిపాలించాలో...

నారా రోహిత్ ప్రధాన పాత్రలో మూర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ప్రతినిధి 2'(Prathinidhi 2). వానర ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

'ప్రతినిధి 2' ట్రైలర్ (Prathinidhi 2 Trailer) ఆకట్టుకుంటోంది. "మన స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? ఎంతమంది గుండెపోటుతో చచ్చారు?" అంటూ నారా రోహిత్ చెప్పే డైలాగ్ తో ఆలోచన రేకెత్తించేలా ట్రైలర్ ప్రారంభమైంది. ఎవరైనా రాజకీయ నాయకులు చనిపోయినప్పుడు.. ఆ బాధ భరించలేక కొందరు సామాన్యులు సూసైడ్ చేసుకున్నారని, మరికొందరు గుండెపోటుతో మరణించారని వార్తలు చూస్తుంటాం. మహాత్ముడు చనిపోయినప్పుడే ప్రజల గుండెలు ఆగలేదు. అలాంటిది ఓ రాజకీయ నాయకుడి కోసం ఆగుతాయా? అనే ప్రశ్నను రేకెత్తిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లలు కంటే, నాలుగు పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కువయ్యాడా?" అని నారా రోహిత్ ప్రశ్నించడం కళ్ళు తెరిపించేలా ఉంది. అవినీతి, అరాచకాలు చేసే రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఓ జర్నలిస్ట్ చేసే పోరాటమే ఈ సినిమా కథ అని ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. "ఒక్కసారి ఎక్కి కుర్చున్నాడంటే.. ఐదేళ్లు వాడు చెప్పింది చేయాల్సిందే. డిసైడ్ చేసుకో.. నిన్ను ఎవరు పరిపాలించాలో. డిసైడ్ చేసుకో.. నీకు ఎవరు కావాలో. వాడా? వీడా? ఇంకెవడైనానా?" అనే డైలాగ్ తో ట్రైలర్ ను ముగించిన తీరు బాగుంది.