English | Telugu

ప్రభాస్ "వారధి" క్లైమాక్స్ కోకాపేట్ లో

ప్రభాస్ "వారధి" క్లైమాక్స్ కోకాపేట్ లో జరుగుతుంది. వివరాల్లోకి వెళితే యూవి క్రియేషన్స్ పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క, రీచా గంగోపాథ్యాయ హీరోయిన్లుగా, రచయిత నుండి దర్శకుడిగా మారిన కోరటాల శివ దర్శకత్వంలో, హీరో ప్రభాస్ స్నేహితులైన ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"వారధి". ఈ "వారధి" చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ కోకాపేట్ లో జరుగుతుంది. ఈ చిత్రానికి యువ సంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

"మర్యాదరామన్న" సెట్ లో ఈ "వారధి" తాలూకు కొన్ని ముఖ్యసన్నివేశాలను ఆమధ్య చిత్రీకరించారు. ఈ చిత్రంతో దర్శకులుగా మారిన సినీరచయితల సంఖ్య మరొకటి పెరిగింది. మరి ప్రభాస్ "వారధి" గట్టిగా నిలబడుతుందా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకూ వేచి చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.