English | Telugu

బేగం పేట పబ్ లో ప్రభాస్ "రెబల్"

బేగం పేట పబ్ లో ప్రభాస్ "రెబల్" చిత్రం షూటింగ్ జరుగుతుంది. వివరాల్లోకి వెళితే యంగ్ రెబెల్ స్టార్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా, పొడుగు కాళ్ళ సుందరి దీక్షా సేథ్ హీరోయిన్లుగా, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, జె.పుల్లారావు, జె.భగవాన్ నిర్మిస్తున్న చిత్రం"రెబెల్". ఈ చిత్రం నిజానికి ఇప్పటికే విడుదల కావలసి ఉంది.

కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర నిర్మాణంలో ఆలస్యమయ్యింది. ప్రస్తుతం ఈ "రెబెల్" చిత్రం షూటింగ్ బేగం పేటలోని బాటిల్స్ అండ్ చిమ్నీస్ అనే పబ్ లో జరుగుతోంది. అయితే ఈ సీన్లో హీరో ప్రభాస్ పాల్గొనటం లేదని సమాచారం. ఫైటర్స్ తో అక్కడ యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.