English | Telugu

ప్రభాస్ డార్లింగ్ ఎవరు?

అందరితో డార్లింగ్ అని పిలిపించుకునే ప్రభాస్ డార్లింగ్ ఎవరంటారు? హా...ఇంకెవరు..అనుష్క, తమన్నా, ఇలియానాలో ఎవరో ఒకరు అయిఉంటారు అనుకున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ ఆరడుగుల అందగాడు ఆరడుగుల అమ్మాయిపై మనసుపడ్డాడట. తెలుగులో ఆ స్థాయి అమ్మాయి అంటే అనుష్క తప్ప ఇంకెవరున్నారు అంటే అసలు నా డార్లింగ్ ఇక్కడ లేదండీ బాబూ...బాలీవుడ్ లో ఉందన్నాడు. దీంతో అవాక్కవడం జనాలవంతైంది.

ఎందుకంటే ఇప్పటివరకూ ప్రభాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టలేదు. బీ టౌన్ హీరోయన్లలో కంగనాతో తప్ప ఇంకెవరితోనూ సినిమా చేయలేదు. అలాంటింది ప్రభాస్ ని డిస్టబ్ చేసిన బ్యూటీ ఎవరబ్బా అంటే....పొడుగుకాళ్ల సుందరి దీపిక పదుకునే అని సిగ్గుపడుతూ చెప్పాడట. ఏంటో అంత స్పెషల్ అంటే....అమ్మడి నటన అదుర్స్ అయితే....ఆమె చూపులు చురకత్తుల్లా ఉంటాయని సెలవిచ్చాడట టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్.

మరి బాలీవుడ్ లో బాహుబలి హిట్టై...అక్కడ ఆఫర్స్ వస్తే ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపిక మురిపిస్తుందేమో? అదేమీ పెద్ద కష్టం కూడా కాదు. అదే నిజమైతే ప్రభాస్-దీపిక జంటని చూసేందుకు రెండు కళ్లు సరిపోవేమో!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.