English | Telugu

'బాహుబలి' కండలు పెంచాల్సిందే

ఇక బాహుబలి 2 గురించే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ప్రభాస్, రానా, అనుష్క తదితరులు తమ శరీరాకృతిని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అనుష్క ఇప్పట్నుంచే జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ తనని తాను తీర్చిదిద్దుకుంటోంది. ప్రభాస్ తొలిభాగం షూట్ పూర్తవ్వగానే రిలాక్సయిపోయాడు. ఆ తర్వాత ఎక్కడ చూసినా స్లిమ్ లుక్ లో కనిపించాడు.అయితే ఇక సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది కాబట్టి ఇప్పట్నుంచే మళ్లీ కసరత్తుల్లో స్పీడ్ పెంచాల్సి ఉంది. పైగా అమరేంద్ర బాహుబలి యుద్ధ విన్యాసాలు గొప్పగా చేశాడన్న పేరొచ్చినా మజిల్ పవర్ ని ఓపెన్ చేసి చూపించడంలో ఫెయిలయ్యాడన్న విమర్శలొచ్చాయి.

అక్కడ యుద్ధ రంగంలో కవచ౦ అతడి దేహాకృతిని పూర్తిగా కవర్ చేసేసింది. ఎంతసేపూ ఆయుధ లాఘవం తప్ప మెలితిరిగిన కండల్ని చూపించే ప్రయత్నం చేయలేదు. శివుడు కూడా చొక్కా విప్పి శివలింగాన్ని ఎత్తే సన్నివేశంలో తప్ప ఎక్కడా మెలితిరిగిన కండల్ని చొక్కా లేకుండా చూపించే ప్రయత్నం చేయలేదు. అయితే ఇక రెండో భాగంలోనైనా ప్రభాస్ తన దేహాకృతితో మోప్పించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.