English | Telugu

"భక్త కన్నప్ప" రీమేక్

"భక్త కన్నప్ప" రీమేక్ చేస్తానని రెబెల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. వివరాల్లోకి వెళితే తన జన్మదినం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం ప్రభాస్ తో కలసి లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న "రెబెల్" చిత్రంలో నటిస్తున్నాననీ, లారెన్స్ తన పాత్రను బాగా తీర్చిదిద్దాడనీ అన్నారు. తాను త్వరలో దర్శకత్వం చేస్తాననీ, తాను తీయబోయే చిత్రం సమాజంలోని సమస్యల గురించీ, వాటి పరిష్కారం గురించీ ఉంటుందనీ అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రభాస్ సినీ కేరీర్ తాను అనుకున్న దానికన్నా చాలా బాగుందనీ, ప్రభాస్ ని పెట్టి "భక్తకన్నప్ప" చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని ఉందనీ, కానీ అదెప్పటికి కుదురుతుందోననీ ఆయన అన్నారు. "భక్త కన్నప్ప" చిత్రంలో కృష్ణంరాజు, వాణీశ్రీ జంటగా నటించగా, బాపు దర్శకత్వంలో కృష్ణంరాజే స్వయంగా నిర్మించారు. ఈ చిత్రం ఒక క్లాసిక్ చిత్రంగా తెలుగు సినీ పరిశ్రమలో స్థానం సంపాదించుకుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.