English | Telugu
పూజాహెగ్డే అంబానీ ఏరియాకి..45 కోట్లు ఓకే..అద్దె నా లేక సొంతమా
Updated : Apr 13, 2024
సినీ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాల్ని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. అందులోనూ హీరోయిన్ల మ్యాటర్ అయితే ఎనలేని ఆసక్తి ఉంటుంది. ఇప్పడు తాజాగా ఒక హీరోయిన్ న్యూస్ ఇదే రకమైన ఆసక్తి అందరిలో కలుగచేస్తుంది. తనెవరో కాదు తెలుగు ప్రేక్షకుల బుట్టబొమ్మ పూజా హెగ్డే. తాజాగా ఆమెకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. పైగా అందరు వామ్మో అని అనుకుంటున్నారు.
ముంబై నగరంలోని బాంద్రా చాలా ఖరీదైన ఏరియా. ఎంతో మంది సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, పొలిటీషియన్స్ , క్రికెటర్స్ అక్కడ నివసిస్తు ఉంటారు.ముకేశ్ అంబానీ అక్కడే ఉంటాడంటే ఎంత రిచ్ ఏరియానో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు పూజా అక్కడకి మారబోతున్నటుగా తెలుస్తుంది. తను ఉండబోయే ఆ ఇల్లు సుమారు 45 కోట్లు దాకా ఉంటుందని అంటున్నారు. సముద్రంకి దగ్గరగా ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. కాకపోతే ఆ ఇంటిని కొన్నదా లేక అద్దెకి దిగుతుందా అనేది తెలియాలి.
పూజా కొంతకాలం క్రితం వరకు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అందరి హీరోలకి ఫస్ట్ ఛాయస్ ఆమెనే. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలతో జత కట్టి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఆ తర్వాత వరుసగా పరాజయాలు రావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. హిందీలో మాత్రం రెండు సినిమాలు చేస్తుంది.ఆ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి