English | Telugu

పోసానిపై  పోలీసు కేసు..


పోసాని కృష్ణ మురళికి సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన పోసాని ఆ తర్వాత దర్శకుడుగా,నటుడుగా ఒక రేంజ్ లో తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించాడు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మురళి పై పోలీస్ కేసు నమోదు చెయ్యమని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.

ఒకప్పటి పోసాని వేరు ఇప్పటి పోసాని వేరు అనేలా ప్రస్తుతం పోసాని తీరు ఉంది.ఒకప్పుడు తన పెన్ను మాత్రమే మాట్లాడేది ఇప్పుడు ఆయన నోరు మాత్రమే మాట్లాడుతుంది. కొన్న్ని రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద పోసాని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసాడు. దీంతో రాజమండ్రి కి చెందిన పవన్ అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో పోసాని తమ నాయకుడి పై నిరాధార ఆరోపణలు చేసాడని చెప్పి పోసాని పై పోలీసు కేసు నమోదు చేసేటందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ లు కేసు స్వీకరించలేదు. దీంతో జనసేన నాయకులు కోర్ట్ ని ఆశ్రయించడంతో పోసాని మీద కేసు నమోదు చెయ్యవలసిందిగా కోర్ట్ పోలీసులని ఆదేశించింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.