English | Telugu

హైటెక్ సిటీలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ

గత కొంతకాలంగా షూటింగ్ ల నుంచి రెస్ట్ తీసుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి 'గోపాల గోపాల' మూవీ షూటింగ్ కి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. పవన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రకరణ జరుపుతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ తో పాటు వెంకటేష్ కూడా పాల్గొంటున్నారు. పవన్ ఇంట్రడక్షన్ కోసం ఈ చిత్రంలో రూ. 6.6 లక్షల విలువ చేసే 'హైసంగ్ జివి 650 ఆక్విలా ప్రో' బైకు వాడుతున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్లో కూడా అక్షయ్ కుమార్ ఇంట్రడక్షన్ బైక్ పైనే వుంటుంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.