English | Telugu

పవర్ స్టార్ అంటేనే నిజాయితీ

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినీ రంగ ప్రవేశం గురించి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నా విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించబోయే ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే ఇంతకు ముందు పూరీ పేరు వినిపించినప్పటికి, పూరీని ఎందుకు వద్దనుకున్నారు? పూరీని వద్దనడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వార్తలు వినిపించాయి.

ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "కెమరామన్ గంగతో రాంబాబు" చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, దాంతోనే వరుణ్ తేజ్ ఎంట్రీ ప్రాజెక్టును పూరీకి ఇవ్వకుండా పవన్ అడ్డుకున్నాడని పుకార్లు వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ అసలు ఈ ప్రాజెక్టుకు ఎవరిని కూడా సజెస్ట్ చేయలేదంట. ఇదంతా కేవలం నిర్మాత అశ్వనీదత్ తీసుకున్న నిర్ణయం అని తెలిసింది. దీనిబట్టి తెలిసిందేమిటంటే.... పవన్ అసలు ఎవర్ని ఏం అనలేడు. ఇదంతా కేవలం పుకార్లు మాత్రమేనని మరోసారి తెలిసింది.

అసలే పవన్ కళ్యాణ్ అంటే శాంతి, అహింస, నిజాయితీ అనే వాటికి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ.. అందరిని ఒకే విధంగా చూసే మంచి మనసున్న కొందరు వ్యక్తులలో పవన్ ఉంటాడని మరోసారి రుజువైనట్లే. మరి పవర్ స్టార్ అంటే మజాకా?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.