Read more!

English | Telugu

ఉదయ్ కిరణ్ 'నువ్వు నేను' రీ రిలీజ్ ట్రైలర్ విడుదల.. బుకింగ్స్ ఓపెన్...

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఆయన నటించిన పలు సినిమాలు ఘన విజయం సాధించాయి. వాటిలో 'నువ్వు నేను' ఒకటి. ఈ మూవీ లో అనిత హీరోయిన్ గా నటించగా.. ప్రముఖ డైరెక్టర్ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. సునీల్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటించగా.. ఆర్.పి. పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ చిత్రం లోని పాటకు ఇప్పటికి ప్లే అవుతూనే ఉంటాయి. అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు ఆర్.పి.పట్నాయక్.

'నువ్వు నేను' మూవీ పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి. ఓవరాల్ గా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా చరిత్ర తిరగరాసింది.

ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో చేయనున్నారు. మార్చి 21న ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. అలాగే బుక్ మై షో, పేటిఎం లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.