English | Telugu

యన్ టి ఆర్ ఊసరవెల్లిలో సమీరా ఐటం సాంగ్ లేదు

యన్ టి ఆర్ "ఊసరవెల్లి" లో సమీరా ఐటం సాంగ్ లేదు అని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా, "కిక్ ‍" సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, "ఛత్రపతి"ఫేం బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న విభిన్నకథాచిత్రం "ఊసరవెల్లి". యన్ టి ఆర్ "ఊసరవెల్లి" చిత్రంలో సమీరా రెడ్డి ఒక ఐటం సాంగ్ లో నటిస్తుందని ఆ మధ్య రూమర్లొచ్చాయి. కానీ అవేవీ నిజంకాదని సమీరారెడ్డి కొట్టిపారేసింది.

సమీరా రెడ్డి గతంలో తెలుగులో "అశోక్, నరసింహుడు" చిత్రాల్లో యన్ టి ఆర్ సరసన, "జై చిరంజీవ" చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించింది. ఈ మూడు చిత్రాలూ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటం విశేషం. వక్కంతం వంశీ కథను అందించిన ఈ యన్ టి ఆర్ "ఊసరవెల్లి" చిత్రం రానున్న దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ నెలలో విడుదల కానుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.