English | Telugu

యన్ టి ఆర్ ఊసరవెల్లిలో సమీరా ఐటం సాంగ్ లేదు

యన్ టి ఆర్ "ఊసరవెల్లి" లో సమీరా ఐటం సాంగ్ లేదు అని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా, "కిక్ ‍" సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, "ఛత్రపతి"ఫేం బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న విభిన్నకథాచిత్రం "ఊసరవెల్లి". యన్ టి ఆర్ "ఊసరవెల్లి" చిత్రంలో సమీరా రెడ్డి ఒక ఐటం సాంగ్ లో నటిస్తుందని ఆ మధ్య రూమర్లొచ్చాయి. కానీ అవేవీ నిజంకాదని సమీరారెడ్డి కొట్టిపారేసింది.

సమీరా రెడ్డి గతంలో తెలుగులో "అశోక్, నరసింహుడు" చిత్రాల్లో యన్ టి ఆర్ సరసన, "జై చిరంజీవ" చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించింది. ఈ మూడు చిత్రాలూ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటం విశేషం. వక్కంతం వంశీ కథను అందించిన ఈ యన్ టి ఆర్ "ఊసరవెల్లి" చిత్రం రానున్న దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ నెలలో విడుదల కానుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.