Read more!

English | Telugu

గుడిలో ఎక్స్ పోజింగ్.. నెటిజన్లు ఫైర్!

సెలెబ్రిటీలు అయినటువంటి కొంతమంది చేసే పనుల వల్ల అందరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. తాజాగా అశ్వినిశ్రీ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చిన అశ్వినిశ్రీ బాగా ఫేమస్ అయింది.

ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా ఓ పోస్ట్ చేసింది అశ్విని. అందులో హీరో ఆదితో కలిసి కొన్ని ఫోటోలు దిగింది.  కవర్ అవినాష్ కూడా అందులో ఉన్నాడు. ఇంకా కొంతమందితో ఓ కొత్త సినిమా మొదలవుతుందని చెప్పగా.. ఓపెనింగ్ సెర్మనీ గుడిలో జరిగిందంట.. అయితే అందులో అశ్వినిశ్రీ ఎక్స్ పోజింగ్ చేస్తూ.. నడుము కనిపించేలా అందాల ఆరబోత చేసినట్టు ఓ స్టిల్ తో ఫోటో పెట్టింది. ఆ ఫోటోని చూసిన నెటిజన్లు అశ్వినిశ్రీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. నీ ఎంకమ్మ గుడిలో కూడా ఆ ఫోజేంటి? అని ఒకరు కామెంట్ చేయగా..గుడిలో ఎందుకండి అవి అని మరొకరు కామెంట్ చేసారు. ఇక మరికొందరు అరేబియన్ గుర్రం,  కంగ్రాట్స్ మేడమ్ అంటు కామెంట్లు చేయగా ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ హౌస్ లో భోలే షావలితో తను ఎక్కువగా ఉండేది. ఇక సీరియల్ బ్యాచ్ తో జరిగే గొడవలో అశ్వినిశ్రీ ఏడ్చేసింది కూడా.. అయితే హౌస్ నుండి బయటకొచ్చాక తనకి వెల్ కమ్ చెప్పడానికి పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చారు. దాంతో ఆ ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటూ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసేసింది ఈ భామ.

అశ్విని శ్రీ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే తనకి ఇన్ స్టాగ్రామ్ లో 550K  ఫాలోవర్స్ ఉన్నారు.  తెలుగమ్మాయి. 1989  జూలై 12 న అశ్విని శ్రీ జన్మించింది. ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. అయితే మొదటగా తను షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చింది. 2016 లో వెండితెరపై అరంగేట్రం చేసింది అశ్విని. సంపూర్ణేశ్ బాబు హీరోగా చేసిన "వినోదం 100 పర్సెంట్" అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత 2017 లో వచ్చిన "అమీర్ పేటలో", 2018 లో వచ్చిన " బిటెక్ బాబులు" , 2020 లో " నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్" వంటి సినిమాలల్లో నటించింది అశ్విని‌.