Read more!

English | Telugu

వరుస ఫ్లాప్స్ ఎదురైనా తగ్గని చైతన్య క్రేజ్.. 40 కోట్లు ఏంటి సామి!

నాగ చైతన్య(Naga Chaitanya) గత చిత్రాలు 'థాంక్యూ', 'కస్టడీ' నిరాశపరిచినప్పటికీ.. ఆయన తదుపరి చిత్రం 'తండేల్'పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్ విడుదల తరువాత అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే షూటింగ్ దశలోనే కళ్ళు చెదిరే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి.

'తండేల్'(Thandel) మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.40 కోట్లకు 'తండేల్' రైట్స్ ని దక్కించుకున్నట్లు సమాచారం. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్. చైతన్య లాంటి యంగ్ స్టార్ సినిమా ఓటీటీ రైట్స్ రూ.40 కోట్లకు అమ్ముడవ్వడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.

'ప్రేమమ్', 'సవ్యసాచి' తరువాత నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రమిది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.