English | Telugu

నేను కింగ్ అంటున్న నాగార్జున

అక్కినేని నాగార్జున డమరుకం చిత్రం ఇటివలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అనేక అవాంతరాలు ఎదురుకున్న తరువాత కూడా ఒక చిత్రం సూపర్ హిట్ అవ్వటం అరుదు కానీ ఈ చిత్రం ఫై వచ్చిన పుకార్లు అన్నింటిని పటాపంచలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద డమరుక నాదం మోగించాడు కింగ్ నాగార్జున . ఈ చిత్రం సక్సెస్ మీట్ లో కింగ్ మాట్లాడుతూ "డమరుకం చిత్రం ను ఆదరించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రేక్షకులకు మరియు అక్కినేని వంశ అభిమానులకు కృతజ్ఞతలు, నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా డమరుకం చిత్రం నిలిచిపోతుంది " .

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.