English | Telugu

జనవరి 15 న మనోజ్ "మిస్టర్ నోకియా" ఆడియో

జనవరి 15న మనోజ్ "మిస్టర్ నోకియా" ఆడియో విడుదల కానుందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. ఈ "మిస్టర్ నోకియా" చిత్రంలో రాక్ స్టార్ మంచు మనోజ్ కుమార్ హీరోగా, కృతి కర్బందా హీరోయిన్ గా, అని (అనిల్ కృష్ణ) దర్శకత్వంలో, డియస్.రావు నిర్మిస్తున్న విభిన్నప్రేమకథా చిత్రం "మిస్టర్ నోకియా". "మిస్టర్ నోకియా" చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ "మిస్టర్ నోకియా" చిత్రంలోని యాక్షన్ సీన్లకు హీరో మంచు మనోజ్ కుమారే కొరియోగ్రఫీ నిర్వహించారనీ, చాలా రిస్కీ షాట్లలో కూడా ఆయన డూప్ లేకుండా నటించారనీ సమాచారం.

అంతే కాదు మనోజ్ ఈ చిత్రంలో ఒక చక్కని పాట కూడా వ్రాశారని తెలిసింది. ప్రముఖ సినీ రచయిత లక్ష్మీ భూపాల్ ఈ "మిస్టర్ నోకియా" చిత్రానికి సంభాషణలు వ్రాశారు. ఈ "మిస్టర్ నోకియా" చిత్రం ఆడియోని ఆదిత్య మ్యూజిక్ ద్వారా, దుర్గం చెరువులో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయాలని విడుదలచేయాలని ఆలోచిస్తున్నారట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.