Read more!

English | Telugu

మెగాస్టార్ చిరంజీవికి సుప్రీం స్పెషల్ షో..!

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ హీరోగా తెరకెక్కిన సుప్రీం ఈరోజు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి ముందురోజు రాత్రి స్పెషల్ షో వేసింది సుప్రీం టీం. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు మెగా మేనల్లుడు. సినిమా మెగాస్టార్ కు చాలా బాగా నచ్చిందని, మూవీ సక్సెస్ అవ్వాలని తనను తన టీం ను ఆశీర్వదించారని ట్వీటాడు. థాంక్యూ మామా అంటూ  చిరంజీవిని మామా అంటూ సంబోధించడం విశేషం.

సాయి ధరమ్ తేజ, రాశి ఖన్నా జంటగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కింది సుప్రీమ్. చాలాకాలంగా తను ఎదురుచూస్తున్న హిట్ ను ఈ సినిమా అందిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నిర్మాత దిల్ రాజు. ఏప్రిల్ 1న రిలీజ్ కావాల్సిన సుప్రీం, ఆ తర్వాత వరస పెద్ద సినిమాలు లైన్ కట్టడంతో ముందుకు జరిగి ఎట్టకేలకు మే 5 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి కార్తీక్ స్వరాలందించాడు. చిరంజీవి సూపర్ హిట్ అందం హిందోళం పాటను ఈ సుప్రీంలో రీమిక్స్ చేయడం విశేషం.