English | Telugu
నాకు ఇలాంటి అవకాసం మళ్లీ రాదేమో
Updated : Feb 15, 2016
దిల్ రాజు నిర్మాతగా సునీల్, నిక్కీగల్రాని, డింపుల్ చోపడే నటీనటులుగా రూపొందిన చిత్రం 'కృష్ణాష్టమి'. వాసువర్మ దర్శకత్వం వహించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆడియో సక్సెస్లో భాగంగా ఆదివారం హైదరాబాద్లో ప్లాటినం డిస్క్ వేడుకని నిర్వహించారు. దిల్ రాజు చిత్ర యూనిట్కి ప్లాటినం డిస్క్ షీల్డ్లను అందజేశారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ ''నా కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదేమో. ఇందులో చాలా అనందంగా కనిపిస్తాను. కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రమిది. మనిషి పుట్టాడంటే ఇంటెలిజెంట్గా పుట్టాలి. లేదంటే వాసువర్మలాంటి ఇంటెలిజెంట్ ఫ్రెండ్ అయినా ఉండాలి. నా కెరీర్ మంచి సినిమా ఇచ్చాడు. మర్యాద రామన్న సినిమా చేసినప్పుడు ఎంత ఆనందంగా ఫీలయ్యానో..ఈ సినిమాకు అలాగే ఫీలయ్యాను'' అని అన్నారు.