Read more!

English | Telugu

గోపీచంద్, కృష్ణ వంశీ మొగుడు క్యాన్సిల్

గోపీచంద్, కృష్ణ వంశీ మొగుడు క్యాన్సిల్ అయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే కృష్ణ వంశీ దర్శకత్వంలో, గోపీచంద్ హీరోగా, తాప్సి హీరోయిన్ గా ప్రారంభమవుతుందనుకున్న "మొగుడు" చిత్రం క్యాన్సిల్ అయ్యిందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలిసింది. దీనికి కారణాలు ఇంకా తెలియరాలేదు కానీ హీరో గోపీచంద్ డేట్లు దర్శకుడు యేలేటి చంద్ర శేఖర్ కు ఇచ్చినట్లు తెలిసింది. అందుకని నాని హీరోగా, కృష్ణ వంశీ మరో సినిమా తీసే పనిలో బిజిగా ఉన్నాడని తెలిసింది. అయితే నాని హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తీయబోయే సినిమా కథ "మొగుడు" కథ ఒకటేనా...? కాదా....? అన్నవిషయం ఇంకా తెలియరాలేదు.

అలాగే గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రాబోయే చిత్రం కథ "మొగుడు" సబ్జెక్ట్ ఒకటేనా ...? కాదా...? అన్న విషయం కూడా కూడా తెలియదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. "శశిరేఖా పరిణయం" వంటి హిట్టిచ్చిన తర్వాత కూడా ఆ మధ్య కృష్ణ వంశీ దర్శకత్వంలో, మాస్ రాజా రవితేజ హీరోగా "కందిరీగ" అనే సినిమా మొదలవుతుందని వినింపించింది. ఆ తర్వాత అక్కినేని వంశం మొత్తం అంటే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ముగ్గురూ నటించే సినిమాకి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తారని కూడా వినపడింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ గోపిచంద్ "మొగుడు" మూవీ కూడా ఆగింది. ఇలా 3 సినిమాలు మొదలవుతాయని మీడియాలో వినపడిన తర్వాత అవి అర్థాంతరంగా ఆగాయంటే లోపం ఎవరిలో ఉందో ప్రేక్షకులకు అర్థం కావటం లేదు.ఒక సీనియర్ డైరెక్టర్ గా కృష్ణ వంశీ ఇలాంటి డైలమాలో ఉండటం ఆయన అభిమానులను అయోమయంలో పడేస్తుంది.