Read more!

English | Telugu

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా హీరో వెంకటేష్ వియ్యంకుడు!

తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా ఖమ్మం పార్లమెంట్ కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్ వేశారు. అయితే ఆయన సినీ హీరో విక్టరీ వెంకటేష్ కి వియ్యంకుడు కావడం విశేషం.

రఘురాంరెడ్డి ఎవరో కాదు.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు. ఖమ్మం జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున పలుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందారు. వయసు రీత్యా సురేందర్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటుండగా.. ఇప్పుడు ఆయన కుమారుడు రఘురాంరెడ్డి రంగంలోకి దిగారు.

రఘురాంరెడ్డికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖ కుటుంబాలతో బంధుత్వం ఉంది. హీరో వెంకటేష్ కుమార్తె అశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అలా ఇటు వెంకటేష్ కి, అటు పొంగులేటికి రఘురాంరెడ్డి వియ్యంకుడు అవుతారన్నమాట.