English | Telugu

పీకేకి క‌మ‌ల్ షాకిచ్చాడు

బాలీవుడ్ లో వ‌సూళ్ల‌నీ, విమ‌ర్శ‌కుల ప్రశంస‌ల‌నూ క‌ట్ట‌క‌ట్టుకొనివెళ్లిపోయాడు పీకె. ఈ సినిమా రీమేక్ రైట్స్‌కోసం ద‌క్షిణాది నుంచి గ‌ట్టిపోటీ ఏర్ప‌డింది. చివ‌రికి జెమిని ఫిల్మ్ స‌ర్య్కుట్ సొంతం చేసుకొంది. క‌మ‌ల్ హాస‌న్ ఈ రీమేక్‌లో న‌టిస్తార‌ని వార్త‌లొచ్చాయి. తెలుగు, త‌మిళం రెండు భాష‌ల్లోనూ క‌మ‌ల్ హాస‌నే పీకె అనుకొన్నారు. అయితే... క‌మ‌ల్ మాత్రం పీకే రీమేక్‌కి నో చెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం నా సినిమాల‌తో నేను బిజీగా ఉన్నాను.. పీకే రీమేక్ కి కాల్షీట్లు కేటాయించే స్థితిలో లేను అని నిర్మాత‌ల‌కు చెప్పేశాడ‌ట‌. పీకేని రీమేక్ చేయాల‌ని క‌మ‌ల్ భావించాడ‌ని, కాక‌పోతే ఈ విష‌యంపై బాగా ఆలోచించి, అంత సాహ‌సం చేయ‌క‌పోవ‌డ‌మే బెటర్ అనే నిర్ణ‌యానికి క‌మ‌ల్ వ‌చ్చాడ‌ని, అందుకే ఈ సినిమాకి నో చెప్పాడ‌ని త‌మిళ వ‌ర్గాలు అంటున్నాయి. క‌మ‌ల్‌పై న‌మ్మకంతో భారీ రేటు వ‌చ్చించి పీకే రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకొన్న‌జెమిని ఫిల్మ్ స‌ర్క్యుట్ క‌మ‌ల్ నిర్ణ‌యంతో బిత్త‌ర‌పోతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.