English | Telugu

కార్తీ జపాన్ ఓటిటి అందులోనే  

హీరో కార్తీకి తెలుగు తమిళంలో సమానమైన క్రేజ్ ఉంది. ఆయన ప్రతి సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకే సారి రిలీజ్ అవుతుంది .ఇప్పుడు లేటెస్ట్ గా జపాన్ అనే మూవీతో కార్తీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పడు ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకి వచ్చింది.

జపాన్ సినిమా ఓటిటి హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కార్తీ సరసన అను ఎమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సునీల్, ప్రముఖ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణం లో వచ్చిన ఈ సినిమాకి రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు.
దీపావళి కానుకగా ఈ రోజు థియేటర్ల లోకి వచ్చిన జపాన్ మూవీ విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. సినిమా చూసిన ప్రేక్షకులందరు కూడా కార్తీ నటన అయితే చాలా బాగుందనే మాట చెప్తున్నారు

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.